News June 13, 2024

T20WC: అసలేమైంది ఈ దిగ్గజ జట్లకు?

image

టీ20 WCలో పలు టాప్ టీమ్స్ పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి చేరాయి. ఆ టీమ్స్‌ సూపర్-8కు వెళ్లాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, అమెరికా వంటి చిన్న జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. దీంతో ఈసారి ప్రపంచ కప్ పోటీలు రసవత్తరంగా మారాయి.

Similar News

News March 22, 2025

కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

image

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 22, 2025

రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం లేదా?

image

చాలా మందికి రాత్రి పూట నిద్రపట్టక సతమతమవుతుంటారు. కానీ కొన్ని అలవాట్లు పాటిస్తే త్వరగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు బాదం పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది. గంట ముందు చెర్రీ రసం తాగితే అందులో ఉండే మెలటోనిన్ హాయిగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. గ్లాసు పసుపు పాలు తాగినా సుఖ నిద్ర పడుతుంది. కాఫీ, టీలు అస్సలు తాగకూడదు. ఇతర పనుల గురించి ఆలోచించకుండా ఉంటే వెంటనే నిద్ర పడుతుంది.

News March 21, 2025

వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

image

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

error: Content is protected !!