News April 6, 2024

వారిపై చర్యలు తీసుకోండి: నిమ్మగడ్డ రమేశ్‌

image

AP: పింఛన్ పంపిణీలో ఆలస్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ‘62 లక్షల మందిని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. నిధులు ఉన్నప్పటికీ కావాలనే పింఛన్‌ల పంపిణీని ఆలస్యం చేశారు. మే నెలలో ఒకటో తేదీనే పింఛన్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News January 20, 2025

అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 57 మంది అరెస్టు

image

కేరళలో అథ్లెట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 57 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా అందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు సార్లు యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు విచారణలో తేలింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.

News January 20, 2025

భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్

image

భారత క్రికెటర్లు మ్యాచ్‌లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.

News January 20, 2025

నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం

image

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.