News February 27, 2025
ఇన్ఫోసిస్ లేఆఫ్స్పై చర్యలు తీసుకోండి: లేబర్ మినిస్ట్రీ

ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో <<15417347>>ట్రైనీస్<<>> లేఆఫ్స్పై కలగజేసుకోవాలని KA లేబర్ కమిషనర్ను కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది. ‘ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి. అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి’ అని అందులో పేర్కొంది. తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 19, 2025
WGL: విద్యుత్ సమస్యలా..? వాట్సాప్ చేయండి!

విద్యుత్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదా..? చాలా సింపుల్. TG NPDCL వాట్సాప్ నంబరుకు మీ సమస్యను పంపించండి. సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపడతారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.
News November 19, 2025
అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.


