News February 27, 2025
ఇన్ఫోసిస్ లేఆఫ్స్పై చర్యలు తీసుకోండి: లేబర్ మినిస్ట్రీ

ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో <<15417347>>ట్రైనీస్<<>> లేఆఫ్స్పై కలగజేసుకోవాలని KA లేబర్ కమిషనర్ను కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది. ‘ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి. అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి’ అని అందులో పేర్కొంది. తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.
Similar News
News March 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
News March 18, 2025
తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్పై కేసు

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.
News March 18, 2025
ఒంటి పూట బడుల సమయం మార్పు

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.