News August 31, 2024
‘గుడ్లవల్లేరు’ ఘటనను సీరియస్గా తీసుకోండి: బొత్స

AP: <<13984448>>గుడ్లవల్లేరు<<>> ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని YCP MLC బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, లేదంటే ఇదో అలవాటుగా మారుతుందని చెప్పారు. విద్యాసంస్థల్లో ఇప్పటికే 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News January 19, 2026
హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు… అప్లై చేశారా?

హైదరాబాద్లోని <
News January 19, 2026
గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News January 19, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాలు

మాఘమాసం పుణ్యకార్యాలకు, దానధర్మాలకు పెట్టింది పేరు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాల వాక్కు. రోజూ మాఘపురాణ పఠనం, విష్ణుసహస్రనామాలు స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.


