News September 22, 2024

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: TTD ఈఓతో పవన్

image

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈఓతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈఓ తెలిపారు. TTD తరఫున రేపు మహాశాంతి యాగం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Similar News

News September 22, 2024

సచిన్‌ను అధిగమించిన రోహిత్ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అత్యధిక విజయాల్లో పాలు పంచుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 484 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 308 గెలుపుల్లో భాగమయ్యారు. ఈ క్రమంలో ఆయన సచిన్ టెండూల్కర్(307 విజయాలు)ను అధిగమించారు. అగ్ర స్థానంలో రికీ పాంటింగ్(377 విజయాలు)ఉన్నారు. ఆ తర్వాత మహేల జయవర్ధనే(336), విరాట్ కోహ్లీ(322) నిలిచారు.

News September 22, 2024

మూవీలో అనుమతి లేకుండా సీన్స్.. స్టార్ డైరెక్టర్ వార్నింగ్

image

తాను హక్కులు పొందిన ‘నవ యుగ నాయగన్ వేల్ పారి’ నవల నుంచి కొన్ని సీన్లను వాడుకోవడం తనను ఇబ్బంది పెట్టినట్లు దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా ట్రైలర్‌లో ముఖ్యమైన సీన్‌ను గమనించానని తెలిపారు. దయచేసి నవలలోని సన్నివేశాలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో వాడొద్దని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో అని చర్చ మొదలైంది.

News September 22, 2024

జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. తొలుత ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికిపైగా వైద్య విద్యార్థులు ఇవాళ టూర్‌కు వచ్చారు.