News April 27, 2024
హైబీపీని లైట్ తీసుకుంటున్నారా?

చాలామంది హైబీపీని లైట్ తీసుకుంటారు. 18-54Yrs మధ్య భారతీయుల్లో 30% BP చెక్ చేయించుకోవడం లేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. సాధారణ రక్తపోటు 120/80 కాగా.. 140/90కి చేరితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. నిరంతర హైబీపీతో కళ్లు దెబ్బతింటాయట. రక్తనాళాలు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చని చెబుతున్నారు.
> SHARE
Similar News
News January 11, 2026
నితీశ్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
News January 11, 2026
అమెజాన్, ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అలర్ట్

ఈ-కామర్స్ సంస్థలు మరో భారీ సేల్స్కు రెడీ అయ్యాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్లో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. మరోవైపు ఫ్లిప్కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. ఫోన్లు, TVలు, ల్యాప్టాప్లపై ఆఫర్లను ఇస్తున్నాయి.
News January 11, 2026
జనవరి 11: చరిత్రలో ఈరోజు

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన రోజు * 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం * 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం * 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు (ఫొటోలో) * 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం


