News November 21, 2024
ఒత్తిడిలో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి!

మార్కులంటూ విద్యార్థులు, టార్గెట్స్ అంటూ ఉద్యోగులూ నిత్యం ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అయితే, అలాంటి సమయంలో తల్లితో మాట్లాడితే ఒత్తిడి మాయమైపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మకు దూరంగా ఉంటే ఫోన్ చేసి ఆమె వాయిస్ వినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని తెలిపాయి. తల్లి స్వరం నుంచి కూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుందని, దీనికి కౌగిలింత అవసరం లేదని పేర్కొన్నాయి. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.
Similar News
News December 13, 2025
కేరళలోనూ వికసిస్తున్న కమలం!

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.


