News February 17, 2025
రేపు రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు

రెండేళ్లుగా యుద్ధ వాతావరణంలోనే ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలకు బీజం పడింది. రేపు సౌదీ అరేబియాలో ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకు అమెరికా మధ్య వర్తిత్వం వహించనుంది. చర్చలు సానుకూలంగా సాగితే ఇరు దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.
Similar News
News March 14, 2026
IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

ఈ ఏడాది ఐపీఎల్లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.
News March 14, 2026
సిలిండర్ల బుకింగ్ మాటున సైబర్ కేటుగాళ్లు

TG: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘వారు పంపే APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. సిలిండర్ తక్షణ డెలివరీ, ముందస్తు చెల్లింపులు అంటూ వచ్చే కాల్స్ను నమ్మొద్దు. బుకింగ్కు అధికారిక వెబ్సైట్లను వినియోగించాలి. లేదా ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలి. http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.
News March 14, 2026
ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేత

గ్యాస్ కొరతతో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. దీంతో ప్రజలు వాటితో వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. దేశ రాజధానిలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా కట్టెల పొయ్యిపై నిషేధం ఉండేది. ఎల్పీజీ సంక్షోభంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేయడం గమనార్హం.


