News April 12, 2025
ధోనీపై తమిళ హీరో అసహనం

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.
Similar News
News April 22, 2025
16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్లోని జయ్నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్లతో గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.
News April 22, 2025
ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

✒ 1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
✒ 1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం(ఫొటోలో)
✒ 1916: ప్రముఖ బెంగాళీ నటి కనన్ దేవి జననం
✒ 1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
✒ 1959: ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం
✒ 1994: US మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
✒ 2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం
News April 22, 2025
ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా ఇకపై ప్రతినెలా ప్రకటించనుంది. మే15 నుంచి దీనికి శ్రీకారం చుట్టనుంది. అలాగే రూరల్ డేటాను 3 నెలలకోసారి(గతంలో ఏడాదికోసారి) వెలువరించనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి నెలా నిరుద్యోగ డేటా వెలువడుతుంది. దీనివల్ల నిరుద్యోగితను తగ్గించేందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.