News March 17, 2024

మోదీ చేతిలో టీడీపీ-జనసేన-వైసీపీ కీలు బొమ్మలు: తులసి రెడ్డి

image

రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. డాబా గార్డెన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే.. రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారుచేసిందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారయని అన్నారు.

Similar News

News January 25, 2026

విశాఖ: గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

image

పోలీస్ ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం నిర్వహించ‌నున్న 77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుకుల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జెండా వంద‌నం జ‌రిగే మైదానంలో ఆదివారం పైల‌ట్ వాహ‌నానికి ట్ర‌యిల్ ర‌న్ నిర్వ‌హించి సిద్ధం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల వివ‌రాల‌ను తెలియజేస్తూ స్టాళ్లను, శ‌క‌టాల‌ను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల న‌గ‌దు ప్రోత్సాహ‌కాలను అందజేయనున్నారు.

News January 25, 2026

​లడ్డా – జిమిడిపేట మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభం

image

వాల్తేరు డివిజన్‌లోని లడ్డా-జిమిడిపేట స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 7.181 కి.మీ.ల మూడో రైల్వే లైన్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) బ్రిజేశ్ కుమార్ మిశ్రా శనివారం తనిఖీ చేశారు. తిత్లాగఢ్ – విజయనగరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో DRM లలిత్ బోహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 25, 2026

విశాఖ ఉత్సవ్‌లో నేడు కామాక్షి లైవ్ వయోలిన్ షో

image

సాగరతీరానా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్కేబీచ్ రోడ్డులో ప్రముఖ సంగీత వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి లైవ్ వయోలిన్ షో నిర్వహించనున్నారు. కామాక్షి ఇండియన్ ఐడల్, పలు మెగా ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.