News August 6, 2024

CM రేవంత్‌తో టీమ్ ఇండియా అంధ క్రికెటర్లు

image

TG: అమెరికా పర్యటనలో ఉన్న CM రేవంత్ రెడ్డిని టీమ్ ఇండియా అంధ క్రికెటర్లు కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం తరఫున క్రికెటర్లకు సాయం చేస్తామని రేవంత్ ప్రకటించారు. కాగా అంధుల క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఆటగాళ్లు US వెళ్లారు. ఆ దేశం తరఫున కూడా అంధుల క్రికెట్ జట్టు ఏర్పాటు చేసేందుకు వీరు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా USలోని 8 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

Similar News

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News April 20, 2026

అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

image

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.

News April 20, 2026

అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

image

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.