News January 24, 2025
పులి దాడిలో టీమ్ ఇండియా క్రికెటర్ బంధువు మృతి

కేరళలోని వయనాడ్లో పెద్ద పులి దాడిలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి బంధువు రాధ (45) ప్రాణాలు కోల్పోయారు. కాఫీ తోటలో పని చేస్తుండగా ఆమెపై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మృతదేహంలో కొంత భాగం తినేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేరళలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రూరమృగాల దాడిలో పదేళ్లలో 8 మంది మృతి చెందారని, ఇంకెంతమంది బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 15, 2026
ఎగుమతుల్లో వృద్ధి.. అమెరికాకు అధికం!

TG: ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 2023లో రూ.95వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2024-2025 నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరాయి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తయారీ రంగంలో ఎగుమతుల్లో 35.2% కేవలం ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతులు USకు(28.17 శాతం) జరుగుతున్నాయి. అటు ఈ అంశంలో దేశంలోనే గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది.
News January 15, 2026
‘జైలర్-2’లో విజయ్ సేతుపతి

రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్లో మోహన్లాల్, శివరాజ్కుమార్తో పాటు షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల హింట్ ఇచ్చారు.
News January 15, 2026
బంగ్లా క్రికెట్లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.


