News March 4, 2025
సెమీస్లో ఎదురే లేని టీమ్ ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్లో భారత్ ఓడిపోలేదు. సెమీస్కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News March 25, 2025
రన్యారావు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 27న తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. న్యాయస్థానంలో వాదనల సమయంలో నటి బెయిల్ను DRI వ్యతిరేకించింది. ఆమె నేరం ఒప్పుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపింది. అలాగే బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు వెల్లడించింది.
News March 25, 2025
స్వదేశీ MRI మెషీన్.. అక్టోబర్ నుంచి ట్రయల్స్

తొలి స్వదేశీ MRI మెషీన్ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.
News March 25, 2025
నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం

2021లో AUSపై గబ్బా స్టేడియం(బ్రిస్బేన్)లో టీమ్ఇండియా టెస్టు విజయం అపూర్వమైనది. 130ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నట్లు క్వీన్స్లాండ్ ప్రభుత్వం తెలిపింది. 1895లో నిర్మించిన ఈ స్టేడియం శిథిలావస్థకు చేరింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2032తర్వాత క్రికెట్ మ్యాచులన్నీ బ్రిస్బేన్ విక్టోరియా పార్క్ వద్ద నిర్మించనున్న స్టేడియంలో నిర్వహిస్తారు.