News October 6, 2024
టీమ్ ఇండియా ఈరోజు ఓడితే ఇంటికే!

మహిళల టీ20 వరల్డ్కప్లో భారత అమ్మాయిలు నేడు పాక్తో తలపడుతున్నారు. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. భారత్ ఉన్న గ్రూప్లో 5 జట్లుండగా, ఇండియానే లాస్ట్ ప్లేస్లో ఉంది. తొలి 2 స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. పాక్పై ఘన విజయం దక్కితే 3వ ప్లేస్కు చేరుకోవచ్చు. మిగిలిన మ్యాచులు కూడా గెలిచి, రన్రేట్ బాగుంటేనే భారత్ సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
Similar News
News March 4, 2026
నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్రేట్ కలిసొచ్చి సెమీస్కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్ రికార్డ్లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 4, 2026
అంగన్వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్వాడీల అరెస్ట్పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.
News March 4, 2026
నెతన్యాహు సైనికుడిగా ఉన్నప్పుడు..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో ఆ దేశ సైన్యంలో పని చేశారు. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)లో సేవలు అందించారు. IDFలో టాప్ సీక్రెట్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే ‘Sayeret Matkal’ అనే యూనిట్లో పని చేశారు. 1972లో సబేనా ప్లేన్ బందీల రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. 1973లో కెప్టెన్ ర్యాంక్ సాధించారు. 1996లో ఇజ్రాయెల్ ప్రధానిగా గెలిచి, పిన్నవయసు PMగా ఘనత సాధించారు.


