News April 5, 2024
టీమ్ ఇండియా పాక్ వెళ్లేది అప్పుడే: కేంద్రమంత్రి

వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వెళ్లే అంశంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీమ్ ఇండియాను పంపించేది లేనిది పూర్తిగా బీసీసీఐ నిర్ణయం. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ముందు ఆ పనిని ఆపాలి. అప్పుడే మన జట్టు అక్కడికి వెళ్తుంది’ అని స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి.. ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి

జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించారు. విశాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి <<16187025>>చంద్రమౌళితోపాటు<<>> కావలి(నెల్లూరు జిల్లా)కి చెందిన మధుసూదన్ కూడా తూటాలకు బలయ్యారు. బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి ఇటీవల కశ్మీర్కు విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్ SIB కార్యాలయంలో పనిచేస్తున్న మనీశ్ రంజన్(బిహార్ వాసి) కూడా కాల్పుల్లో చనిపోయారు.
News April 23, 2025
టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
News April 23, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.