News January 10, 2025
తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం
ఐర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53) అర్ధ సెంచరీలతో చెలరేగారు. స్మృతి మంధాన (41) పవర్ప్లేలో ధాటిగా ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో మాగూర్ 3 వికెట్లు, సార్జెంట్ ఓ వికెట్ పడగొట్టారు.
Similar News
News January 25, 2025
RCBకి పెద్ద దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
WPL-2025కి RCB ఆల్ రౌండర్ సోఫీ డివైన్ దూరమయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్రొఫెషనల్ అడ్వైజ్ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు NZ పేర్కొంది. WPLలో RCB తరఫున 18 మ్యాచులాడిన సోఫీ 402 రన్స్, 9 వికెట్లు తీశారు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు(99*) ఆమె పేరిటే ఉంది. ఓపెనర్గా మెరుపులు మెరిపించే ఈ ప్లేయర్ లేకపోవడం RCB పెద్ద లోటే.
News January 25, 2025
పద్మవిభూషణులు వీరే
1. దువ్వూరు నాగేశ్వర రెడ్డి(వైద్యం)- తెలంగాణ
2. జగదీశ్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు)- చండీగఢ్
3. కుముదిని రజనీకాంత్ లఖియా (కళలు)- గుజరాత్
4. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం (కళలు)- కర్ణాటక
5. ఎం.టీ. వాసుదేవన్ నాయర్ (లేటు) (సాహిత్యం) – కేరళ
6. ఒసాము సుజుకీ (లేటు) (వాణిజ్యం) – జపాన్
7. శారదా సిన్హా (లేటు) (కళలు)- బిహార్
News January 25, 2025
బాలకృష్ణకు సీఎం చంద్రబాబు అభినందనలు
AP: పద్మభూషణ్ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు. లెజండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు, సేవా రంగాల్లో రాణిస్తున్నారని కితాబిచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అంకితభావంతో చేసిన సేవ వేల మంది జీవితాలను తాకిందని, లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఇది నిజమైన ఐకాన్, దయగల నాయకుడికి తగిన గౌరవం అని సీఎం పేర్కొన్నారు.