News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

Similar News

News December 27, 2025

ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

AP: ఈ ఏడాది సరైన ధరలు లేక, వాతావరణం అనుకూలించక ఉల్లి రైతులకు భారీ నష్టాలు మిగిలాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన వారికి పరిహారం అందిచేందుకు రూ.128 కోట్లు విడుదల చేసింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ సాయం అందించనుంది. ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752మంది రైతులకు పరిహారం అందజేశారు.

News December 27, 2025

జనరేషన్ బీటా గురించి తెలుసా?

image

2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లలందరినీ ‘జనరేషన్ బీటా’గా పిలుస్తారు. ఈ తరం పూర్తిగా AI ప్రపంచంలో పెరగనుంది. భారత్‌లో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. ఇలా జనరేషన్స్​కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు జనరేషన్ X​ (1965-80), జనరేషన్ Y లేదా మిలీనియల్స్​(1981-1996), జనరేషన్ Z​ (1997-2009), జనరేషన్ ఆల్ఫా (2010-2024)లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఏ జనరేషన్‌?

News December 27, 2025

పబ్లిక్ ప్లేస్‌లో పావురాలకు మేత వేస్తున్నారా?

image

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్‌కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.