News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News December 19, 2025
జెనోమిక్స్.. రూ.10వేల టెస్టు రూ.వెయ్యికే

వైద్యరంగంలో అతిపెద్ద విప్లవానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. క్యాన్సర్ సహా భవిష్యత్తులో వచ్చే రోగాలను ముందే గుర్తించేందుకు వీలుగా ₹10వేల విలువైన జెనోమిక్స్ టెస్టును ₹వెయ్యికే అందించాలని యోచిస్తోంది. దీనివల్ల ముందుగానే జాగ్రత్త పడటానికి వీలవుతుంది. రక్తం/లాలాజలం/శరీరంలోని టిష్యూని ఉపయోగించి ఈ పరీక్ష చేస్తారు. జెనోమిక్స్తో సమాజంపై తమ ముద్ర వేస్తామని సంస్థ సీనియర్ అధికారి నీలేశ్ వెల్లడించారు.
News December 19, 2025
జెనోమిక్స్ టెస్టు అంటే ఏమిటి?

ఒక వ్యక్తి DNAలోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియనే జెనోమిక్స్ అంటారు. ఇవి 2 రకాలు.. ఎక్సోమ్ సీక్వెన్సింగ్(ప్రొటీన్ను తయారుచేసే భాగాన్ని టెస్టు చేయడం), హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్(మొత్తం జన్యుకోడ్ను విశ్లేషించడం). జన్యు సంబంధ వ్యాధులు, కిడ్నీ, గుండె, నరాల సమస్యలు, క్యాన్సర్ను ముందే గుర్తించడానికి వీలవుతుంది. దీనివల్ల వ్యక్తికి ఏ మందులు, ఎంత మోతాదులో సురక్షితంగా పనిచేస్తాయో అంచనా వేయొచ్చు.
News December 19, 2025
కాన్వే డబుల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా కివీస్

వెస్టిండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. రెండో రోజు సెకండ్ సెషన్ కొనసాగుతుండగా 461/5 రన్స్ చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డబుల్ సెంచరీతో చెలరేగారు. ఆయన 31 ఫోర్ల సాయంతో 227 రన్స్ చేసి ఔట్ అయ్యారు. లాథమ్ 137 రన్స్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రచిన్(22), బ్లండెల్(3) ఉన్నారు. 3 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ డ్రా అవ్వగా రెండో టెస్టులో కివీస్ గెలుపొందింది.


