News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News February 13, 2026
‘లోకల్’ ఫలితాలపై ‘గులాబీ’లో అంతర్మథనం

TG: మున్సి‘పోల్స్’ పై BRSలో అంతర్మథనం మొదలైంది. KTR, హరీశ్ మినహా పార్టీ MLAలు, నేతలు పోరాడిన స్థానాల్లో ఫలితం దక్కలేదు. గజ్వేల్, సిరిసిల్ల, దుబ్బాకలో గెలవగా మిగతా చోట్ల హంగ్, లేదా 2వ స్థానంలో నిలిచింది. జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సహా ఉమ్మడి నల్గొండలో విఫలమైంది. దయాకర్ రావు జిల్లా WGLలోనూ అంతే. హుజూరాబాద్, జమ్మికుంటలో కౌశిక్ దెబ్బతిన్నారు. HYD శివారులో పట్టు నిలుపుకొంది.
News February 13, 2026
రిలయన్స్కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.
News February 13, 2026
మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.


