News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News April 7, 2025
పవన్ కళ్యాణ్పై ఆ వార్తలు అవాస్తవం: పోలీసులు

AP: జేఈఈ పరీక్షలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వస్తున్న <<16020277>>వార్తలు <<>>అవాస్తవమని విశాఖ పోలీసులు తెలిపారు. ‘ప్రతి విద్యార్థీ ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలి. కానీ ఉదయం 8.41 గంటలైనా వారు పెందుర్తి జంక్షన్ దగ్గరే ఉన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఉదయం 8.30 గంటలకే బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం-పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలపలేదు’ అని వారు తెలిపారు.
News April 7, 2025
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసుపై రేపు తీర్పు

TG: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 FEB 21న జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా 130 మంది గాయపడ్డారు. ఎన్ఐఏ 157 మంది సాక్షులను విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు NIA కోర్టు మరణశిక్ష విధించగా వారు హైకోర్టును ఆశ్రయించారు.
News April 7, 2025
ప్రభుత్వానికి సలహా మండలి: సీఎం చంద్రబాబు

AP: ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం సలహా మండలిని నియమించనున్నట్లు RTGSపై సమీక్షలో CM చంద్రబాబు ప్రకటించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, IIT సహా వివిధ రంగాలకు చెందిన 10 మంది నిపుణులు ఉండనున్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేలా ఇంకా ఏమి చేయవచ్చనే దానిపై ఈ మండలి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుందని వివరించారు. కాగా జూన్12 కల్లా వాట్సాప్లోకి అన్ని సేవలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.