News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

Similar News

News December 31, 2025

ఒత్తు పొత్తును చెరుచు

image

ఒంటి ఎద్దుతో సేద్యం చేసేటప్పుడు నాగలి లేదా కాడిని ఎద్దు మెడపై సరిగా పెట్టకుండా, ఒక పక్కకే ఎక్కువ ఒత్తు (ఒత్తిడి) పడేలా చేస్తే, అది ఎద్దు మెడపై పొత్తు (చర్మం) దెబ్బతినడానికి, వాపు రావడానికి కారణమవుతుంది. అందుకే సేద్యం చేసేటప్పుడు కాడి భారం ఎద్దు భుజాలపై సమానంగా పడాలి. ఎద్దుకు నొప్పి కలిగితే అది సరిగా నడవలేదు, దీనివల్ల సేద్యం ఆలస్యమవుతుంది, పశువు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఈ సామెత చెబుతుంది.

News December 31, 2025

ఒకరోజు ముందే పెన్షన్లు.. నేడు పంపిణీ!

image

AP: ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా పెన్షన్‌దారులకు నేడు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇవాళ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు.

News December 31, 2025

నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి?

image

రాహుకాలంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం ఉత్తమం. శుక్రవారం అంతకన్నా ఉత్తమం. అయితే శుభ దినాల్లో, ఉపవాసం ఉండే రోజుల్లో వెలిగించకూడదు. పండుగ రోజున, పెద్దల తిథి ఉన్నప్పుడు, ఇంట్లో జన్మదినాలు, జయంతి, పెళ్లిరోజులప్పుడు నిషిద్ధం. ఈ పరిహారం పాటిస్తే ఆరోజున ఊరు దాటి వెళ్లకూడదు. పట్టుచీర ధరించి వెలిగిస్తే ఎక్కువ ఫలితముంటుంది. ఈ దీపం పెడితే ఇతర దీపాలేవీ వెలిగించకూడదు. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.