News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News October 20, 2025
నేవల్ షిప్ రిపేర్, ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ యార్డ్లో 224 పోస్టులు

నేవల్ షిప్ రిపేర్ యార్డ్( కార్వార్, కర్ణాటక), నేవల్ ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ యార్డ్ (గోవా)లో 224 అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు NOV 16లోపు నేషనల్ అప్రెంటిస్షిప్ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, డాక్యుమెంట్స్ను స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: www.apprenticeshipindia.gov.in/
News October 20, 2025
దీపావళి: నేడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

దీపావళి లక్ష్మీ పూజలో పసుపు, ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. పసుపు(బృహస్పతి) సంపద, శాంతిని, ఎరుపు(కుజుడు) శక్తి, ధైర్యాన్ని, తెలుపు శాంతి, లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తాయని అంటున్నారు. నీలం, నలుపు రంగులు అశుభమని, ఆ రంగు దుస్తులు ధరించకూడదని అంటున్నారు. నైలాన్, పాలిస్టర్లకు దూరంగా, కాటన్, పట్టు వంటి సురక్షితమైన వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం’ అంటున్నారు.
News October 20, 2025
టీమ్ఇండియా ఫ్యాన్స్కు హార్ట్ బ్రేక్!

దీపావళికి ఒక్కరోజు ముందే టీమ్ఇండియా(M&W) క్రికెట్ జట్లు ఓడిపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురి చేసింది. నిన్న తొలుత పురుషుల జట్టు ఆసీస్తో తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత WWCలో భాగంగా జరిగిన కీలక మ్యాచులో మహిళల టీమ్ కూడా పరాజయం చెందడం సగటు అభిమానికి బాధను మిగిల్చింది. గెలవాల్సిన మ్యాచులో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఓడటం టీమ్ఇండియా ఫ్యాన్స్కు నిజంగా హార్ట్బ్రేకే.