News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News January 13, 2026
JN: రూ.100 కోట్లకు పైగానే అక్రమాలు!

భూభారతిలో అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.100 కోట్లు గండి కొట్టినట్లు తెలుస్తోంది. 2020 Nov 2 నుంచి 31 DEC 2025 వరకు (భూభారతి + ధరణి ) 52,13,729 ట్రాన్సాక్షన్లు జరిగాయి. 41,38,641 సేల్ డీడ్ ట్రాన్సాక్షన్లతో ప్రభుత్వానికి రూ.13,473 కోట్ల ఆదాయం వచ్చింది. సుమారు 5,200 స్లాట్ బుకింగ్లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. NLG, MDK, RR జిల్లాల్లోనే అత్యధిక ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
News January 13, 2026
కోలీవుడ్లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్కు కాంగ్రెస్ డిమాండ్

కోలీవుడ్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.


