News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News February 17, 2026
వనపర్తి: తొలి ఓసి మహిళా ఛైర్మన్ మాధవి రికార్డ్

వనపర్తి మున్సిపాలిటీకి ఈరోజు తొలి ఓసి మహిళా ఛైర్మన్గా ఎన్నికై వనపర్తి చరిత్రలో మిరిదొడ్డి మాధవి రికార్డ్ సృష్టించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి కౌన్సిలర్గా విజయం సాధించడమే గాక ఛైర్మన్గా ఎన్నికై జాక్పాట్ కొట్టారు. గతంలో రిటైర్డ్ టీచర్ ప్రమీలమ్మ ఛైర్ పర్సన్గా ఎన్నిక కాగాఆమె బీసీ మహిళ కావడం విశేషం. ఆమెకు రాజకీయ నేపథ్యం ఉందని, రాజకీయాలకు కొత్తయిన మాధవి పాలన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.
News February 17, 2026
₹34,855 కోట్లు.. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఇది!

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్లైన్ ఫ్రాడ్తో నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ₹34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. అందులో ₹12,230 కోట్లను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలపై నమోదైన 234 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులతో దోచుకుంటున్నట్లు వెల్లడించారు.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.


