News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

Similar News

News December 26, 2025

DRDEలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

image

<>DRDO <<>>పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(DRDE) 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్ల లోపు అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. MSc బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ (3rd/4th సెమిస్టర్) , బీఈ/ బీటెక్(7th/8th సెమిస్టర్) చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.5వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News December 26, 2025

ఆఫీసు కుర్చీలో నిద్రపోవడం అశుభమా?

image

ఆఫీసు కుర్చీని సింహాసనంలా భావించాలని పండితులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఆ కుర్చీపై నిద్రించడం తగదంటున్నారు. ‘ఇది వృత్తి పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలు, అశుభ ఫలితాలను కలిగించే అవకాశముంది. ఇది ప్రగతిని అడ్డుకుని ప్రతికూల శక్తిని పెంచవచ్చు. మీకు అలసటగా ఉంటే నడవడం, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవడం చేయాలి. కుర్చీలో నిద్రించడం కెరీర్‌కు మంచిది కాదు’ అంటున్నారు.

News December 26, 2025

వైకల్యం బారిన పడ్డ RTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: సర్వీసులో వైకల్యం బారిన పడిన RTC ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా ఆర్థిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు GO 58 విడుదల చేసింది. 2020 తరువాత సర్వీసులోకి తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అర్హులకు ప్రాధాన్య క్రమంలో కలెక్టర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఉద్యోగాలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వికలాంగ జాబితాలో లేని వారికి మానిటరీ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పారు.