News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
Similar News
News April 20, 2025
కాబోయే భర్తకు ఉండాల్సిన 18 లక్షణాలు.. యువతి పోస్ట్ వైరల్

తనకు కాబోయే భర్తకు 18 లక్షణాలు ఉండాలంటూ డేటింగ్ యాప్లో ఓ యువతి పోస్ట్ చేసింది. ‘నాపై డీప్ లవ్, రూ.2.5 కోట్ల జీతం, లగ్జరీ లైఫ్, ఉదార స్వభావం, తెలివైన, ధైర్యం, విలువలు, ఫిట్నెస్, క్రమశిక్షణ, సామాజిక గౌరవం, ఫ్యామిలీ పర్సన్, నా లైఫ్స్టైల్కు సపోర్ట్, ట్రావెలింగ్, ప్రైవసీకి ప్రాధాన్యం, లైంగిక క్రమశిక్షణ, గర్భనిరోధక చర్యలు, ఈజీ లైఫ్ లీడ్ చేయించే వాడు’ తనకు భర్తగా కావాలని రాసుకొచ్చింది. మీ COMMENT?
News April 20, 2025
మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.
News April 20, 2025
VIRAL: ఈ 500 తీసుకుని పాస్ చేయండి..!

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని రాశారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.