News September 22, 2024
పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


