News September 22, 2024
పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.
Similar News
News April 2, 2026
పెరిగిన ఎండలు – రైతులకు సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఈ తరుణంలో పంటల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడి నుంచి నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, వరి గడ్డి లేదా సేంద్రీయ వ్యర్థాలను మల్చింగ్గా వేయాలి. దీని వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నిపుణుల సూచన మేరకు పంట దశను బట్టి నీటిని తప్పక అందించాలి.
News April 2, 2026
GK: పార్లమెంటు నిర్మాణం

భారత పార్లమెంటులో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అనే 3 విభాగాలు ఉంటాయి. *దిగువ సభ అయిన LSలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 550. సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు. పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఏళ్లు.
*రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ఇది ఒక శాశ్వత సభ (దీనిని రద్దు చేయడం వీలుకాదు). సభ్యుల పదవీ కాలం: 6 సంవత్సరాలు (ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు). పోటీ చేయడానికి కనీస వయస్సు 30 ఏళ్లు.
News April 2, 2026
మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.


