News September 22, 2024

పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

image

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.

Similar News

News February 17, 2026

సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

image

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌ (కోల్‌కతాలో)తో తలపడనుంది.

News February 17, 2026

పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

image

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.

News February 17, 2026

ధరలు పెరిగినా.. బంగారం దిగుమతులు తగ్గేదేలే!

image

భారత్‌లో ఈ ఏడాది జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా ఎగబాకాయి. స్విట్జర్లాండ్, UAE నుంచి భారీగా తరలిరావడంతో మొత్తం గోల్డ్ ఇంపోర్ట్స్ $12.1 బిలియన్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 3నెలల గరిష్ఠానికి ($34.7 బిలియన్లు) చేరింది. క్వాంటిటీ పరంగా దిగుమతులు తగ్గుతున్నా ధరలు ఆకాశాన్ని తాకడం వల్లే విలువల పరంగా ఈ పెరుగుదల కనిపిస్తోందని, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ ఎగబాకడమూ ఓ కారణమని వాణిజ్య శాఖ వివరించింది.