News December 31, 2024
రూ.8వేల కోట్ల కలెక్షన్లు సాధించిన ‘తెలుగు సినిమా’
భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా మరోసారి సత్తాచాటింది. 2024లో ఇండియన్ బాక్సాఫీసులో రూ.8వేల కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించింది. హిందీ సినిమా రూ.10వేల కోట్లతో తొలిస్థానంలో ఉండగా రూ.7వేల కోట్లతో తమిళ సినిమా మూడో ప్లేస్లో నిలిచింది. మలయాళం రూ.6వేల కోట్లు, కన్నడ రూ.5వేల కోట్లు సాధించాయి. ఆ తర్వాత పంజాబీ(రూ.300కోట్లు), మరాఠీ(రూ.185 కోట్లు), గుజరాతీ(రూ.70 కోట్లు), బెంగాలీ(రూ.55 కోట్లు) ఉన్నాయి.
Similar News
News January 22, 2025
శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు
AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.
News January 22, 2025
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. MSP పెంపు
జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.
News January 22, 2025
ఆ మూర్ఖులను కఠినంగా శిక్షించండి
పుష్పక్ ఎక్స్ప్రెస్లో <<15226066>>మంటలొచ్చాయని<<>> వదంతులు సృష్టించిన మూర్ఖులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా వెళ్తోన్న రైలులో మంటలు చెలరేగాయని ప్రాంక్ చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం వల్లే అన్యాయంగా 8 మంది చనిపోయారని మండిపడుతున్నారు. వదంతులు సృష్టించిన వారిని శిక్షించి, ఇంకోసారి ఎవరూ ఇలా చేయకుండా భయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.