News June 19, 2024

భారత వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ ఎంట్రీ

image

భారత మహిళా వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ అరుంధతి‌రెడ్డి(27) అరంగేట్రం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆమె టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నుంచి క్యాప్ అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరుంధతి మీడియం పేస్ వేయడంతో పాటు మంచి బ్యాటర్‌‌గానూ పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే టీ20 జాతీయ జట్టులో ఉన్నారు. 26 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు, 73 రన్స్ చేశారు.

Similar News

News April 14, 2026

పిల్లులు సగం ఆహారమే ఎందుకు తింటాయి?

image

సాధారణంగా పెంపుడు పిల్లులు పెట్టిన ఆహారంలో సగమే తిని మిగతాది వదిలేస్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఆహారం తాలూకు వాసన వాటికి బోర్ కొట్టడమేనని పరిశోధనల్లో తేలింది. ఎంత మంచి ఆహారం అయినా సరే రోజూ అదే పెడితే పిల్లులు క్రమంగా దాన్ని తినడం తగ్గించేస్తాయట. వేర్వేరు రకాల ఆహారం పెడుతూ ఉంటే అవి తినేందుకు ఆసక్తి చూపిస్తాయని.. ఆకలి కంటే కూడా వాసనకే ప్రాధాన్యం ఇస్తాయని రీసెర్చ్ పేర్కొంది.

News April 14, 2026

సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి: CM

image

TG: లోక్‌సభ సీట్ల పెంపుపై అభ్యంతరం తెలుపుతూ సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని తెలిపారు. లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే సపోర్ట్ చేస్తామన్నారు.

News April 14, 2026

కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.