News June 25, 2024
తెలుగు వ్యక్తికి దుబాయ్లో రూ.2.25 కోట్ల లాటరీ

బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి లక్కీ డ్రాలో రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. APకి చెందిన బోరుగడ్డ నాగేంద్రం 2017లో UAE వెళ్లారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ప్రతి నెలా 100 దిర్హామ్స్ను నేషనల్ బాండ్స్లో పొదుపు చేశారు. ఆ స్కీమ్లో తీసిన తాజా లక్కీ డ్రాలో నాగేంద్రం విజేతగా నిలిచారు. వాటితో తన పిల్లల్ని బాగా చదివించి చక్కటి భవిష్యత్తును ఇస్తానంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.