News February 10, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News March 27, 2026
ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.
News March 27, 2026
కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.
News March 27, 2026
GK: చంద్రయాన్-3 విశేషాలు

⋆ ప్రయోగం తేదీ: జులై 14, 2023
⋆ చంద్రుడిపై ల్యాండింగ్: AUG 23, 2023
⋆ రాకెట్ పేరు: LVM3-M4, ల్యాండర్: విక్రమ్, రోవర్: ప్రజ్ఞాన్
⋆ చంద్రయాన్-3 ల్యాండయిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
⋆ ల్యాండింగ్ తేదీని కేంద్రం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది
⋆ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్
⋆ US, రష్యా, చైనా తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ చేసిన 4th దేశంగా భారత్


