News February 10, 2025

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌: ప్రాంతీయ భాషలో నేమ్ బోర్డ్స్!

image

డీలిమిటేషన్‌ మీట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి CMలు, పార్టీల ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కనిపించిన ఓ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌లో ఉన్నట్లు ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లను ఇంగ్లిష్‌తో పాటు వారి భాషల్లో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. CM రేవంత్ & KTR వద్ద తెలుగు బోర్డులు కనిపించాయి. కాగా, మొదటి నుంచి TN ప్రభుత్వం హిందీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

News March 22, 2025

రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు

image

TG: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News March 22, 2025

ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

image

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.

error: Content is protected !!