News February 4, 2025
తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్

AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Similar News
News February 18, 2025
భారత్లో అడుగుపెట్టనున్న టెస్లా..!

ఈవీ దిగ్గజం టెస్లా భారత్లో రిక్రూట్మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
News February 18, 2025
3 నెలలుగా ‘గృహలక్ష్మి’ స్కీమ్ డబ్బుల్లేవ్!

కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లలో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకూ బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, త్వరలోనే వేస్తామని Dy CM DK శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని CM సిద్దరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్.
News February 18, 2025
భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్లో విండీస్పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్పై ఈ స్కోర్లు చేశారు.