News March 30, 2024

మే మొదటి వారంలో టెన్త్ ఫలితాలు!

image

AP: టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌ తెలిపారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. 6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.

Similar News

News January 18, 2025

జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..

image

ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.

News January 18, 2025

ODI WC23-CT25 మధ్య జట్టులో మార్పులివే

image

2023 వన్డే వరల్డ్ కప్‌కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో 10 మంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. సూర్య, ఇషాన్, శార్దుల్, సిరాజ్, అశ్విన్ స్థానాల్లో జైస్వాల్, పంత్, సుందర్, అర్ష్‌దీప్, అక్షర్ ఎంట్రీ ఇచ్చారు. వీరంతా కూడా జాతీయ జట్టులో ఆడినవారే. ఈసారి కొత్త ముఖాలకు చోటు కల్పించలేదు. ఈ టీమ్‌ కూర్పు సరిగా లేదని కొందరు విమర్శిస్తుండగా, బాగానే ఉందని పలువురు అంటున్నారు. మీరేమంటారు?

News January 18, 2025

స్టార్ హీరోపై కత్తి దాడి.. అరెస్టైన నిందితుడు ఇతడే!

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే పోలీసులు <<15190207>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ఫొటో వెలుగులోకి వచ్చింది. అతడిని పట్టుకున్నట్లు RPF పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్‌కి సమాచారం ఇచ్చారు. అతడి పేరు ఆకాశ్ కనోజియాగా గుర్తించారు. దీంతో ముంబై అధికారులు వీడియో కాల్ చేసి నిందితుడిని చూశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరారు. నిందితుడిని ముంబై తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేయనున్నారు.