News September 19, 2024

వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 20, 2024

‘పుష్ప 2’లో డేవిడ్ వార్నర్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వార్నర్ కేమియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా బన్నీ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

News September 20, 2024

ఆందోళన విరమించిన కోల్‌కతా వైద్యులు

image

కోల్‌కతాలో RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ వైద్యులు తమ నిరసనల్ని విరమించారు. ఇటీవల వారు రాష్ట్ర సర్కారుతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నిరసనలకు స్వస్తి పలికి శనివారం నుంచి విధులకు హాజరవుతామని వారు ప్రకటించారు. అత్యవసర సేవల్ని ప్రారంభిస్తామని, ఓపీడీ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.

News September 20, 2024

రాజకీయాల నుంచి ఆలయాలకు స్వేచ్ఛ ఇవ్వాలా?

image

తిరుపతి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?