News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
Similar News
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
News December 1, 2025
కిచెన్ టిప్స్.. మీ కోసం..

* సొరకాయ మిగిలిపోయినపుడు కుళ్లిపోకుండా ఉండాలంటే.. ఆ వైపును అల్యూమినియం ఫాయిల్తో చుట్టాలి.
* గాజు గ్లాసులను తరలించేటప్పుడు వాటికి కాటన్ క్లాత్/ సాక్స్లు తొడిగితే ఒకదానికొకటి తగిలినా పగలవు.
* కేక్ మిశ్రమంలో టీ స్పూన్ గ్లిజరిన్ కలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* వాటర్ బాటిల్ను వాడకుండా ఉంచితే దుర్వాసన వస్తుంది. ఇలా జరగకూడదంటే అందులో యాలకులు/లవంగాలు/ దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచండి.
News December 1, 2025
రష్యాపై ఆంక్షలు.. 17,700 KMs నుంచి ఇండియాకు ఆయిల్

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దేశం గయానా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాదాపు 17,700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. 2 సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో దాంట్లో 2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ వస్తోంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.


