News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
Similar News
News November 23, 2025
OP సిందూర్పై పాక్ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన ఫ్రెంచ్ నేవీ

ఆపరేషన్ సిందూర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థానీ మీడియాపై ఫ్రెంచ్ నేవీ విమర్శలు గుప్పించింది. మేలో జరిగిన ఘర్షణల్లో భారత రఫేల్ జెట్లను కూల్చి పాక్ వాయుసేన ఆధిపత్యం చెలాయించిందంటూ ఓ ఫ్రెంచ్ ఆఫీసర్ చెప్పినట్లుగా అక్కడి మీడియా రాసుకొచ్చింది. అది అసత్యాలతో కూడిన కల్పిత కథనమని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది. ఆ ఆఫీసర్ పేరు కూడా తప్పేనని, అతను ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది.
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News November 23, 2025
‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?


