News March 31, 2024

ముగిసిన టెన్త్ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం

image

AP: నిన్నటితో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 18న ప్రారంభమైన ఎగ్జామ్స్‌కు 6,18,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. సుమారు 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి 25వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Similar News

News February 1, 2026

ఏపీ ముఖ్యమైన కేటాయింపులు ఇలా..

image

* అమరావతి రాజధాని అభివృద్ధి(ఏడీబీ నిధులు)- రూ.1,128 కోట్లు
* అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్(జపాన్ నిధులు)- రూ.432 కోట్లు
* గ్రామీణ రహదారులు- రూ.500 కోట్లు
* పట్టణాల్లో తాగు, మురుగు నీటి పారుదల- రూ.800 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం- రూ.155 కోట్లు
* రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం- రూ.350 కోట్లు

News February 1, 2026

NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మధ్యప్రదేశ్ సెహోర్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<>NIMHAR<<>>) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MDRA, PGDEI, PGDRP, MASLP, డిగ్రీ+DISLI, పీజీ(డిజాబిలిటీ/సోషల్ సైన్స్), MD(పీడియాట్రిక్స్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nimhr.nic.in

News February 1, 2026

‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

image

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.