News October 5, 2024

TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్

image

TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్‌ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 3, 2026

క్యాన్సర్‌తో 2023లో లక్ష మంది మృతి!

image

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 1990 నుంచి 2023 మధ్య కాలంలో ఈ కేసులు 477%, మరణాలు 352% పెరిగాయని ‘లాన్సెట్’ నివేదిక తెలిపింది. 2023లోనే దేశంలో 2.03 లక్షల కేసులు, లక్ష మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఈ కేసులు 35 లక్షలకు చేరుతాయని అంచనా. ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు పరీక్షలు అత్యవసరమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు.

News March 3, 2026

గ్రహణం ఎఫెక్ట్.. టీమ్‌ఇండియా ప్రాక్టీస్ ఆలస్యం!

image

ENGతో జరగనున్న T20 WC సెమీస్ కోసం టీమ్‌ఇండియా ముంబై వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 6PM నుంచి 9PM వరకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే గ్రహణం కారణంగా షెడ్యూల్ టైమింగ్స్ మార్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 6.47PMకి గ్రహణం ముగియడంతో 7PM నుంచి ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలిపింది. గ్రహణం టైంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 3, 2026

స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే..: CM

image

TG: మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. పిల్ల‌ల‌కు పోషకాహారం అందాలని, అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి, డ్ర‌గ్స్‌, ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే అందుకు ఆయా విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాలే బాధ్య‌త వ‌హించాలని స్పష్టం చేశారు. సైకాలజిస్టులను నియమించుకోవాలని సూచించారు.