News April 24, 2024
ఘోరం.. టెన్త్లో స్టేట్ టాపర్ ముఖంపై ట్రోల్స్
సోషల్ మీడియాలో పలువురు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. UP టెన్త్ ఫలితాల్లో 98.50% మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచిన ప్రాచీ నిగమ్ అనే బాలిక ముఖంపై కొందరు ట్రోల్స్ చేశారు. ఆమెకు అవాంఛిత రోమాలు ఉండటంపై ఎగతాళిగా పోస్టులు పెట్టారు. ఆ చదువుల తల్లిని ప్రశంసించాల్సింది పోయి పాశవిక మీమ్స్తో శునకానందం పొందారు. ఇది చాలా దారుణమని, ట్రోలర్స్ను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News October 15, 2024
భారత్కు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నా: సంజూ
టీమ్ ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు భారత ప్లేయర్ సంజూ శాంసన్ తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉందని చెప్పారు. దులీప్ ట్రోఫీకి ముందు టెస్టుల కోసం తనను పరిగణనలోకి తీసుకుంటామని, రంజీపై ఫోకస్ చేయమని హైకమాండ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ సారి ప్రిపరేషన్ మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్తో జరిగిన చివరి టీ20లో సంజూ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.
News October 15, 2024
భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.
News October 15, 2024
రతన్ టాటా కుక్క బెంగతో చనిపోయిందా..? నిజమిదే!
స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్స్పెక్టర్గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.