News April 24, 2024
ఘోరం.. టెన్త్లో స్టేట్ టాపర్ ముఖంపై ట్రోల్స్
సోషల్ మీడియాలో పలువురు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. UP టెన్త్ ఫలితాల్లో 98.50% మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచిన ప్రాచీ నిగమ్ అనే బాలిక ముఖంపై కొందరు ట్రోల్స్ చేశారు. ఆమెకు అవాంఛిత రోమాలు ఉండటంపై ఎగతాళిగా పోస్టులు పెట్టారు. ఆ చదువుల తల్లిని ప్రశంసించాల్సింది పోయి పాశవిక మీమ్స్తో శునకానందం పొందారు. ఇది చాలా దారుణమని, ట్రోలర్స్ను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News February 5, 2025
ChatGPT, డీప్సీక్పై నిషేధం
రహస్య సమాచారం, పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉండటంతో ఛాట్జీపీటీ, డీప్సీక్ వంటి అన్ని రకాల AI టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్పెండీచర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, దీపమ్, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న, కేంద్ర బడ్జెట్కు ముందు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది.
News February 5, 2025
TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ
AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 5, 2025
ఏపీ అసెంబ్లీకి లోక్సభ స్పీకర్
AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.