News April 24, 2024

ఘోరం.. టెన్త్‌లో స్టేట్ టాపర్‌ ముఖంపై ట్రోల్స్

image

సోషల్ మీడియాలో పలువురు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. UP టెన్త్ ఫలితాల్లో 98.50% మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్ అనే బాలిక ముఖంపై కొందరు ట్రోల్స్ చేశారు. ఆమెకు అవాంఛిత రోమాలు ఉండటంపై ఎగతాళిగా పోస్టులు పెట్టారు. ఆ చదువుల తల్లిని ప్రశంసించాల్సింది పోయి పాశవిక మీమ్స్‌తో శునకానందం పొందారు. ఇది చాలా దారుణమని, ట్రోలర్స్‌ను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Similar News

News January 16, 2025

రేపు ఓటీటీలోకి విడుదల-2?

image

వెట్రిమారన్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్‌గా నిలిచాయి.

News January 16, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీ?

image

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ కింద రూ.10వేల కోట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో చర్చించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

News January 16, 2025

మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?

image

జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.