News December 25, 2024
టెస్టు ర్యాంకింగ్స్: తొలి స్థానంలో బుమ్రా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బౌలర్ బుమ్రా తొలి స్థానానికి ఎగబాకారు. 904 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. దీంతో అశ్విన్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశారు. టాప్-10లో భారత్ నుంచి అశ్విన్(5), జడేజా(10) ఉన్నారు. ఇక టెస్టు బ్యాటర్లలో రూట్ తొలి స్థానంలో ఉండగా భారత్ నుంచి జైస్వాల్(5) మాత్రమే టాప్-10లో ఉన్నారు. జట్ల పరంగా ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News January 22, 2025
సైఫ్పై కత్తి దాడి: పోలీసు శాఖ ట్విస్ట్
యాక్టర్ సైఫ్ అలీఖాన్పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పీఐ సుదర్శన్ గైక్వాడ్ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్నూర్కర్ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
News January 22, 2025
APలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయండి: లోకేశ్
దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.
News January 22, 2025
ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్
AP: నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2 నెలలు పొడిగించింది. అక్రమాలపై పూర్తి సమాచారం పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.