News January 4, 2025

HMPV వైరస్‌పై TG ప్రభుత్వం కీలక ప్రకటన

image

చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు & ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీరు పుష్కలంగా తాగుతూ పౌష్టికాహారం తినాలి. ఎక్కువగా నిద్రపోవాలి. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు’ అని తెలిపింది.

Similar News

News October 14, 2025

ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

image

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. అయితే ఈ ప్యాక్‌తో వాటిని ఇంట్లోనే తొలగించుకోవచ్చు. చెంచా జెలటిన్ పొడిలో చల్లార్చిన పాలు, తేనె, చిటికెడు పసుపు కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొని వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో అద్దుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మాస్క్ తీసేసి ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా అవాంఛితరోమాలు దూరమవుతాయి.

News October 14, 2025

బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

image

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్‌ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఛావ(రూ.808Cr) ఉంది.

News October 14, 2025

BREAKING: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.