News January 10, 2025
TG: స్కిల్స్ యూనివర్సిటీలో మరో 3 కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
☛ ఎండోస్కోపీ టెక్నీషియన్: 6 నెలల శిక్షణ. ఇంటర్ BiPCలో 50% మార్కులు, 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఫీజు ₹10వేలు
☛ టీ వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్: 2 నెలల కోర్సు. టెన్త్ పాసై, 18-25 ఏళ్ల వయసుండాలి. ఫీజు ₹3వేలు
☛ మెడికల్ కోడింగ్& స్టాఫ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ (55 డేస్): BSC(లైఫ్ సైన్సెస్) పాసవ్వాలి. వయసు 18-25. ఫీజు ₹18వేలు
☛ వెబ్సైట్: https://yisu.in/
Similar News
News January 24, 2025
20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
News January 24, 2025
విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో VSR పిటిషన్
AP: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కాగా రాజకీయాలు వీడుతున్నట్లు VSR ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 24, 2025
వీటిని రాత్రి నానబెట్టి తింటే..
అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. తేనెతో కలిపి పరగడుపున తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. రక్త సరఫరా పెరుగుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఇందులోని పోషకాలు సహాయపడతాయి.