News December 16, 2024

షార్‌లో వందో రాకెట్ ప్రయోగం.. ఎప్పుడంటే?

image

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చే ఏడాది జనవరిలో ఇస్రో GSLV-F15 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది షార్ నుంచి చేపట్టే వందో రాకెట్ ప్రయోగం. దీనితో షార్ మరో మైలురాయిని చేరుకోబోతున్న సందర్భంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు రావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. 100వ రాకెట్ ప్రయోగం కావడంతో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

Similar News

News December 23, 2025

పిల్లల్లో నులిపురుగుల ప్రభావం

image

పిల్లల్లో నులిపురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడం. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లలకు శుభ్రత గురించి చెప్పాలి.ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి.

News December 23, 2025

గుడ్లతో సకాలంలో పీరియడ్స్: డాక్టర్లు

image

అన్ని వయసుల ఆడవారికి గుడ్డు మంచి పోషకాహారం అని వైద్యులు చెబుతున్నారు. పచ్చ సొనలోని కొలిన్, విటమిన్ B 12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పునరుత్పత్తి అవయవాలు, వాటి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గుడ్డులోని కొవ్వులు హార్మోన్లను బ్యాలెన్స్ చేసి సకాలంలో పీరియడ్స్ వచ్చేలా చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు కంటి చూపు మెరుగవుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు.

News December 23, 2025

విదేశీ చదువుల్లో AP యువతే టాప్

image

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో AP యువత దేశంలోనే టాప్‌లో నిలిచింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 2020లో AP నుంచి 35,614 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, పంజాబ్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో తెలంగాణ టాప్ 10లో లేదు. ఇక 2024లో మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కెనడా, US, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.