News February 16, 2025

చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

image

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News April 11, 2026

ADB: కొత్త ‘మీసేవ’లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

News April 11, 2026

ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.

News April 11, 2026

KGBV దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో చేరేందుకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు ఈనెల 20వ తేదీ వరకు పొడిగించామన్నారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు మిగతా తరగతుల్లో మిగిలిపోయిన అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32,079 సీట్లకు గానూ నిన్నటి వరకు 69,362 దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు.