News May 11, 2024
ముగిసిన ప్రచార పర్వం.. మూగబోయిన మైకులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా ప్రచారంలో హోరెత్తించిన మైకులు, DJలు, నేతల గళాలు మూగబోయాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సా.4 గంటలకే బంద్ కాగా.. మిగతా చోట్ల ఈ సా.6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లూ ఇంటింటికీ తిరిగి అభ్యర్థులు హామీల వర్షం కురిపించగా.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. జూన్ 4న ఓటర్ల నాడి ఏంటన్నది ఫలితాల్లో తేలనుంది.
Similar News
News December 5, 2025
సిద్దిపేట: కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు.. ఉచిత చేప పిల్లలు: హరీశ్ రావు

కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు ఉచిత చేప పిల్లలు అందాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగా భవాని ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిద్దిపేట ఫిష్ మార్కెట్ను చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేశామన్నారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరికి అన్నింటా శుభం చేకూరాలన్నారు.
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.
News December 5, 2025
మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్లో నటిస్తా: శివరాజ్కుమార్

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.


