News October 18, 2024

టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLAలు, MLCలు, MPలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.

Similar News

News April 16, 2026

BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

image

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతి‌పక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.

News April 16, 2026

IPL: ఇదేం రూల్ సార్..

image

నిన్న LSGతో మ్యాచులో RCB బౌలర్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై కొందరు IPL ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అతడు తీసింది ఒకే ఒక్క వికెట్. కానీ మరో బౌలర్ రసిఖ్ దార్ 4 వికెట్లు పడగొట్టారు. అయితే హేజిల్‌వుడ్ కంటే అతడు 4 పరుగులు ఎక్కువ ఇచ్చారు. అతడి ఎకానమీ 6 కాగా హేజిల్‌వుడ్‌ది 5. దీంతో POTMకు ఇదే కొలమానమా? వికెట్లు తీయాల్సిన అవసరం లేదా? అని కొందరు BCCIని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News April 16, 2026

బియ్యపు పిండి దీపంతో కలిగే లాభమేంటి?

image

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.