News October 18, 2024

టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLAలు, MLCలు, MPలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.

Similar News

News April 10, 2026

డ్రంకెన్ డ్రైవ్ చేశారని పోలీసులు వాహనాన్ని సీజ్ చేయకూడదు: హైకోర్టు

image

TG: మద్యం తాగి వాహనం నడిపినంత మాత్రాన ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే లేదా సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనదారుడు మత్తులో ఉంటే, అతడి బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. ఒకవేళ ఎవరూ లేకపోతే మాత్రమే తగిన జాగ్రత్తలతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని పేర్కొంది.

News April 10, 2026

5,000 మంది ఇరాన్ సైనికులు హతం: ఇజ్రాయెల్

image

40 రోజులపాటు కొనసాగిన యుద్ధంలో ఇరాన్‌లోని 4వేల టార్గెట్లపై 10,800 దాడులు చేసినట్లు IDF వెల్లడించింది. దాడి మొదటి రోజే కేవలం 40 సెకన్లలో సుప్రీం లీడర్ ఖమేనీ సహా 40 మందిని హతమార్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఇరానియన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేసింది. 85 శాతం డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్‌పై ఇరాన్ 650 మిస్సైళ్లను వేయగా 24 మంది చనిపోయినట్లు సమాచారం.

News April 10, 2026

ఆర్టీసీ భూములు సరే.. గీతం సంగతేంటి: YCP

image

AP: విజయవాడ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన RTC భూములను చంద్రబాబు కమీషన్ తీసుకొని లులూకు కట్టబెట్టారని YCP ఆరోపించింది. ఈ అక్రమ భూకేటాయింపులపై తాము చేసిన పోరాటానికి దెబ్బకి దిగొచ్చి కేటాయింపులను రద్దు చేసుకున్నారని తెలిపింది. RTC భూములు సరే, విశాఖలో గీతం యూనివర్సిటీకి కట్టబెట్టిన రూ.5వేల కోట్ల విలువైన భూముల సంగతేంటి CBN? అని ప్రశ్నించింది. ఆ కేటాయింపులను ఎప్పుడు రద్దు చేస్తారు? అని ట్వీట్ చేసింది.