News May 4, 2024

ఈ లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్ల పైమాటే: CMS

image

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుకు లిమిట్ ఉంది కానీ పార్టీలకు లేదు. 2019 ఎన్నికల్లో BJP ₹1,264 కోట్లు, INC ₹820 కోట్లు వ్యయం చేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి పార్టీలు, అభ్యర్థులు చేసిన ఖర్చు ₹60,000 కోట్లు పైనేనని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్(CMS) నివేదిక వెల్లడించింది. ఈ LS ఎన్నికల్లో అనధికార ఖర్చు ₹1.2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఒక్కో సెగ్మెంట్ సగటు వ్యయం ₹221 కోట్లు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 16, 2025

250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్‌సైట్: https://cabsec.gov.in/

News November 16, 2025

ఇంటి వస్తువులను పాదబాటలపై పెట్టవచ్చా?

image

జనరేటర్లు, షెడ్లను పాదబాటలపై ఏర్పాటు చేయడం వాస్తు విరుద్ధమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం పాదబాటలపై షెడ్ వేసినా, అది ప్రజల హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ‘ఇంటికి చెందిన ప్రతి వస్తువు, నిర్మాణం ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వీధులను ఆక్రమిస్తే వాస్తు శక్తికి ఆటంకం కలుగుతుంది. ఎవరి పరిధిలో వారు ఉంటేనే వాస్తు ఫలితాలు పూర్తిగా లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 16, 2025

ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి కేసులో కీలక పురోగతి సాధించినట్లు NIA ప్రకటించింది. ఈ దాడికి సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర చేసిన కశ్మీర్ వాసి అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసినట్లు తెలిపింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చేందుకే ఇతను ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొంది. ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే.