News August 9, 2024
ఫొగట్ అభ్యర్థనపై స్పందించిన కోర్టు

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో ఫైనల్ చేరిన తనకు సిల్వర్ మెడల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై CAS(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) స్పందించింది. ఈ ఒలింపిక్ క్రీడలు ముగిసేలోపు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా 100గ్రాముల అధిక బరువు వల్ల ఫైనల్స్లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. <<-se>>#Olympics2024<<>>
Similar News
News March 18, 2026
ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.
News March 18, 2026
మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.
News March 18, 2026
లెక్క లెక్కే.. బుమ్రాకు న్యాయం చేసేలా BCCI ప్లాన్స్

కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ₹7 కోట్లు అందుకునేవారు. రోహిత్, కోహ్లీ ఒకే ఫార్మాట్ ఆడుతుండటం, జడేజా T20Iల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బుమ్రా ఒక్కరే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. దీంతో A+ కేటగిరీని తొలగించి అందరినీ A గ్రేడ్కు మార్చడంతో ఆయనకు ₹2 కోట్ల నష్టం జరుగుతోంది. దీన్ని భర్తీ చేసేందుకు BCCI కాంట్రాక్ట్ రివైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్షర్, సిరాజ్ల కాంట్రాక్టూ మారొచ్చు.


