News November 19, 2024
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

JEE అడ్వాన్స్డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.
Similar News
News December 30, 2025
రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో 47.68 లక్షల సంచుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రబీ సీజన్(అక్టోబర్-మార్చి)లో కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల(LMTs) యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు అందిన 5.70LMTs యూరియాలో 3.71LMTs రైతులు కొనుగోలు చేయగా 2.15LMTs జిల్లాల్లో అందుబాటులో ఉందన్నారు.
News December 30, 2025
వచ్చే ఏడాదీ రిపీట్ చేస్తారా?

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే చాలు ఎక్కడ లేని రెజల్యూషన్స్ వస్తాయి. జిమ్కు వెళ్లడం, డైట్ మెయింటేన్ చేయడం, హెల్త్ను కాపాడుకోవడం, డబ్బులు సేవ్ చేసుకోవడం అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. 2025 ప్రారంభంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకొని ఉంటారు. వీటిలో ఎన్ని ఆచరణలో పెట్టారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? మారింది ఇయర్ మాత్రమేనా? మీ లైఫ్లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి?
News December 30, 2025
నాన్న లేని లోకంలో ఉండలేక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

TG: తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. ఫ్రెండ్స్లా ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.


