News November 19, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.

Similar News

News December 22, 2025

వాట్సాప్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ చేస్తే అంతే!

image

UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్‌లో వచ్చిన ఫొటోను డౌన్‌లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు. అతని ఫొటోను వాట్సాప్‌లో పంపించగా.. డౌన్‌లోడ్ చేయగానే ఫోన్‌లో APK ఫైల్ ఇన్‌స్టాల్ అయి నగదు మాయమైంది. అపరిచిత వ్యక్తులు పంపే ఫొటోలు, ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News December 22, 2025

RSSను పటేల్ బ్యాన్ చేశారు: జైరాం రమేశ్

image

<<18632147>>RSSపై<<>> కాంగ్రెస్ MP జైరాం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్ RSSను నిషేధించారన్నారు. ‘రహస్య సంస్థలా కాకుండా పారదర్శకంగా పనిచేయాలంటూ గురు గోల్వాల్కర్‌కు పటేల్ లేఖ రాశారు’ అని తెలిపారు. నాగ్‌పూర్ కేంద్రంలో దశాబ్దాల పాటు జాతీయ జెండా ఎగరవేయకపోవడం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అంబేడ్కర్, పటేల్, నెహ్రూ, గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆ సంస్థ సిద్ధాంతాన్ని ప్రశ్నించారు.

News December 22, 2025

మంగళగిరిలో బాలికపై గ్యాంగ్‌రేప్.. లోకేశ్ స్పందించరా: వైసీపీ

image

AP: మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బాలిక(13)పై గ్యాంగ్ రేప్ జరిగిందని YCP ట్వీట్ చేసింది. ఈ ఘటనపై లోకేశ్ సైలెంట్‌గా ఉన్నారని ఆరోపించింది. ‘తన సొంత నియోజకవర్గంలో ఇంత భయంకరమైన నేరం జరిగితే లోకేశ్ స్పందించకపోవడం మహిళల భద్రత విషయంలో ఆయన ఉదాసీనతను సూచిస్తోంది. రాజకీయ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతలు దెబ్బతినకూడదు’ అని పేర్కొంది. బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.