News November 19, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.

Similar News

News December 23, 2025

జామఆకులతో మొటిమలకు చెక్

image

సీజనల్‌గా దొరికే జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. కానీ.. జామకాయలే కాదు వాటి ఆకులూ మనకి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. జామలోని విటమిన్-సి మొటిమలకు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

News December 23, 2025

ఈ అలవాట్లే క్యాన్సర్‌కు దారి తీస్తాయి

image

ఈ రోజుల్లో యువత అనుసరిస్తున్న కొన్ని అలవాట్లు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి శరీరంలోని సర్కాడియన్ రిథమ్‌ను దెబ్బతీసి, DNA మరమ్మతు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫైబర్ తక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారం శరీరం తినడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ D లోపం, స్మోకింగ్ చేయడం కూడా ప్రమాదకరమే.

News December 23, 2025

200 మంది ఇంజినీర్లతో ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక

image

TG: ఇరిగేషన్ ప్రాజెక్టులపై KCR విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈనెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే ప్రధానంగా చర్చించనుంది. దీనికోసం 200 మంది ఇంజినీర్లతో సమగ్ర నివేదికనూ సిద్ధం చేయిస్తోంది. ప్రాజెక్టులకోసం INC చేసిన ప్రయత్నాలు, అనుమతుల సాధనలో గతంలో BRS వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచాలని నిర్ణయించింది. CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రసంగించనున్నారు.