News November 19, 2024
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

JEE అడ్వాన్స్డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.
Similar News
News November 21, 2025
మూవీ ముచ్చట్లు

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్బాస్ సీజన్-12పై మహిళా కమిషన్కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్లో టాక్
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.
News November 21, 2025
PHOTO: ఫిట్నెస్ ఫ్రీక్గా భారత మహిళా క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెట్లో ఫిట్నెస్ అనగానే మేల్ క్రికెటర్స్ గురించే మాట్లాడతారు. వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైరలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు U-19 T20 వరల్డ్ కప్-2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్రసాద్. ఆమె ఫిట్నెస్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


