News May 19, 2024
అనంతలో మొదలైన వజ్రాల వేట

AP: అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు పడుతుండటంతో ప్రజలు పొలాలను జల్లెడ పడుతున్నారు. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా జూన్, జులైలో కురిసే వర్షాలకు ఇక్కడ రాళ్లను వెతకడానికి ప్రజలు వస్తుంటారు. చిన్న రాయి (వజ్రం) కూడా భారీ ధర పలుకుతుంది.
Similar News
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్స్టాలో 14L, యూట్యూబ్లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.
News November 6, 2025
‘Google Photos’లో అదిరిపోయే ఫీచర్

చాలామంది తమ ఫోన్లో దిగిన ఫొటోలను ఫ్రెండ్స్కు పంపేందుకు వాట్సాప్ వాడతారు. ఇలా చేస్తే ఫొటోల క్లారిటీ తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గూగుల్ ఫొటోస్’ యాప్లో డైరెక్ట్గా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీకి యాక్సెస్ ఇవ్వొచ్చు. దీనికోసం <
News November 6, 2025
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.


