News February 8, 2025
17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.
Similar News
News March 24, 2025
ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.
News March 24, 2025
అమరావతిలో 250 ఎకరాల్లో ప్రధాని సభ!

AP: రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు PM మోదీ వచ్చే నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైనా పీఎంవో తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది.
News March 24, 2025
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న APలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ను కోరింది. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.