News August 19, 2024
ఆ బకాయిలు రూ.80 వేల కోట్లు: సెబీ

రికవరీ చేయడానికి కష్టతరమైన బకాయిల మొత్తం గత ఏడాదితో పోలిస్తే 4% పెరిగి ₹76,293 కోట్లకు చేరుకున్నట్టు సెబీ తెలిపింది. 807 కేసుల్లో 95% (విలువ ఆధారంగా) కోర్టులలో లేదా కోర్టు నియమించిన కమిటీల ముందు పెండింగ్లో ఉన్నందున వీటిని రికవరీకి కష్టమైన బకాయిలుగా వర్గీకరించినట్టు తెలిపింది. సెబీ చట్టాలను ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులు, మధ్యవర్తులపై నియంత్రణ సంస్థ జరిమానాలు విధిస్తుంటుంది.
Similar News
News July 10, 2025
17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.
News July 10, 2025
భూకంపాలు ఎందుకు వస్తాయంటే?

భూమి ఆకస్మికంగా కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు బలంగా కదిలినప్పుడు భూకంపం వస్తుంది. భూపాతాలు, హిమపాతాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి. రిక్టర్ స్కేల్పై 7 దాటితే భవనాలు పేకమేడల్లా కూలుతాయి. రోడ్లు చీలిపోతాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.
News July 10, 2025
PHOTO GALLERY: ‘మెగా PTM’లో CBN, లోకేశ్

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పిల్లలకు సీఎం పాఠాలు చెప్పారు. సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంబంధించి వారు Xలో ఫొటోలు షేర్ చేశారు.