News March 21, 2024

ఫెడ్ రేట్ల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ల జోరు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభపడి 72,854 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 22068 వద్ద ట్రేడవుతున్నాయి. BPCL, NTPC, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్‌కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని సూచనలు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.

Similar News

News July 8, 2024

శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

image

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.

News July 8, 2024

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

image

BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్‌షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.

News July 8, 2024

మణిపుర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.