News March 21, 2024
ఫెడ్ రేట్ల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభపడి 72,854 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 22068 వద్ద ట్రేడవుతున్నాయి. BPCL, NTPC, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని సూచనలు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


