News December 5, 2024
నిజాయితీకి ప్రతిరూపం: 33 ఏళ్లలో 57 బదిలీలు

‘4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట’ విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. నిజజీవితంలోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. IAS అశోక్ ఖేమ్కా 33ఏళ్ల కెరీర్లో 57వ సారి బదిలీ అయ్యారు. 2025 APR 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హరియాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
Similar News
News February 4, 2026
రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.
News February 4, 2026
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.
News February 4, 2026
మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


