News March 23, 2024
రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కుటుంబం ఆత్మహత్య

AP: కడప జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట(M) కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. అతడి భార్య పద్మావతి, కూతురు వినయ ఇంట్లో బలవన్మరణం చెందారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేశారని, మనస్తాపంతో చనిపోతున్నామని లేఖలో రాసి ఉంది.
Similar News
News July 8, 2025
శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.
News July 8, 2025
పవన్ కళ్యాణ్ ఆగ్రహం

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.
News July 8, 2025
వామ్మో రష్మిక.. గుర్తు పట్టారా!(PHOTO)

‘మైసా’లో లుక్తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరలవుతోంది. ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఫొటో షూట్లో వెస్టర్న్ లుక్లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మరి నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.